మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై దురుసు ప్రవర్తన... సినీ నటి రాధా ప్రశాంతిపై కేసు!

  • బంజారాహిల్స్ లో బిల్డింగ్ సెక్యూరిటీ మహిళపై దాడి 
  • వీడీయో తీస్తుంటే మహిళా టెక్కీపై దురుసు ప్రవర్తన 
  • కేసు దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
తనపై సినీ నటి రాధా ప్రశాంతి దురుసుగా ప్రవర్తించారంటూ, ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే, ఇక్కడి ఓ భవనంలో బిల్డింగ్ సెక్యూరిటీగా లక్ష్మి అనే మహిళ పని చేస్తోంది.

ఉన్నట్టుండి నిన్న రాత్రి ఆ పక్కనే ఉంటున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు పెద్ద శబ్దం వినిపించగా, ఆమె బయటకు వచ్చి చూసింది. ఆ సమయంలో లక్ష్మిని రాధా ప్రశాంతి కారు ఢీకొట్టింది. ఆపై ఆమె, ఆమెతో పాటు వున్న మరో వ్యక్తి లక్ష్మిపై దాడి చేస్తున్నారు. ఈ ఘటనను చూసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన మొబైల్ ఫోన్ లో ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు. దీన్ని గమనించిన రాధా ప్రశాంతి, తీవ్ర ఆగ్రహంతో ఆమెపై దురుసుగా ప్రవర్తించి, సెల్ ఫోన్ లాక్కుని దాన్ని ధ్వంసం చేసింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి, ఆమెపై ఫిర్యాదు చేసింది. 

Radha Prashanti
Softwear Engeneer
Police
Hyderabad
Case

More Telugu News